తమిళనాట మారుతున్న రాజకీయం... స్థానిక ఎన్నికల వేళ... టీవీకేలోకి డీఎంకే, అన్నాడీఎంకే నేతలు
- తమిళనాట త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
- అధికార టీవీకే పార్టీలోకి పెరుగుతున్న వలసలు
- పశ్చిమ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్న చేరికల జోరు
- స్థానిక ఎన్నికల్లోనూ టీవీకే గెలుస్తుందన్న అంచనాలు
తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడనుందన్న అంచనాల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలోకి ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి నేతలు, కార్యకర్తలు వలస వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అనూహ్య విజయం సాధించి అధికారంలోకి రావడం, పార్టీ ప్రభావం రోజురోజుకు విస్తరిస్తుండటంతో క్షేత్రస్థాయి నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ వలసలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇటీవల పలువురు కీలక నేతలు టీవీకేలో చేరారు. ఈరోడ్ జిల్లాకు చెందిన డీఎంకే రాష్ట్ర స్థాయి ఫంక్షనరీ ఎల్లపాలయం ఆర్. శివకుమార్, నమక్కల్ తూర్పు జిల్లా కోశాధికారి ఏకే బాలచందర్, రాశిపురం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు రామ్కుమార్, 'గేట్' తంగవేల్ వీరిలో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి కేవీ రామలింగం కూడా సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టయార్ సమక్షంలో టీవీకేలో చేరారు.
ఈ వలసలు ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో దక్షిణ, మధ్య జిల్లాల నుంచి మరిన్ని చేరికలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటిస్తే అసెంబ్లీ ఫలితాలే పునరావృతం అవుతాయనే భావన క్షేత్రస్థాయి నేతల్లో బలంగా ఉందని, అందుకే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఓ విశ్లేషకుడు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అనూహ్య విజయం సాధించి అధికారంలోకి రావడం, పార్టీ ప్రభావం రోజురోజుకు విస్తరిస్తుండటంతో క్షేత్రస్థాయి నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఈ వలసలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇటీవల పలువురు కీలక నేతలు టీవీకేలో చేరారు. ఈరోడ్ జిల్లాకు చెందిన డీఎంకే రాష్ట్ర స్థాయి ఫంక్షనరీ ఎల్లపాలయం ఆర్. శివకుమార్, నమక్కల్ తూర్పు జిల్లా కోశాధికారి ఏకే బాలచందర్, రాశిపురం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు రామ్కుమార్, 'గేట్' తంగవేల్ వీరిలో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రి కేవీ రామలింగం కూడా సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టయార్ సమక్షంలో టీవీకేలో చేరారు.
ఈ వలసలు ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో దక్షిణ, మధ్య జిల్లాల నుంచి మరిన్ని చేరికలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటిస్తే అసెంబ్లీ ఫలితాలే పునరావృతం అవుతాయనే భావన క్షేత్రస్థాయి నేతల్లో బలంగా ఉందని, అందుకే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఓ విశ్లేషకుడు తెలిపారు.